అయోధ్యలో ఉన్నది రామాలయమే! పురావస్తు శాస్త్రవేత్త కె.కె.మహ్మద్!
అయోధ్య విషయాన్ని వివరించ కుండా నా జీవిత కథ పూర్తికాదు. ఇది ఎవరి మత విశ్వాసాలను కించపరచడానికి గాని, వేరొకరి మత విశ్వాసాలను సమర్థించడానికి గాని ఉద్దేశించినది కాదు. అటువంటి ఉద్దేశాలతో గాని, అటువంటి ప్రయోజనాలకు గాని దీనిని ఏవిధంగానూ ఉపయోగించకూడదు. 1990లో అయోధ్య సమస్య తీవ్రంగా మారింది. కాని అంతకుముందే 1978లోనే ఒక పురావస్తు శాస్త్ర విద్యార్థిగా అయోధ్యను పరిశీలించడానికి నాకు అవకాశం దొరికింది. ! ఢిల్లీలోని పురావస్తు శాస్త్ర పాఠశాల విద్యార్థిగా ఉన్నప్పుడు, అయోధ్య వద్ద విస్తృత పరిశీలన జరుపుతున్న ప్రొఫెసర్ బి.బి.లాల్ నేతృత్వంలోని బృందంలో నేనొక సభ్యునిగా ఉన్నాను. అంతకు ముందే ఉనికిలో ఉన్న దేవాలయ స్తంభాలను ఆధారంగా కనుగొన్నాము. ఆ రోజుల్లో ఇటువంటి ఆవిష్కరణను ఎవరూ వివాదాస్పదంగా చూడలేదు. చారిత్రక భావనతో పురాతత్వ శాస్త్ర నిపుణులుగా వాస్తవాలను మేము పరిశీలించాం. ! బాబ్రి మసీదు గోడలపై పొందుపరచిన ఆలయ స్తంభాలున్నాయి. ఈ స్తంభాలు నల్లని సాలగ్రామం వంటి శిలతో తయారయ్యాయి. 11-12 శతాబ్దిలలోని ఆచరణకు అనుగుణంగా స్తంభాల దిగువ భాగంలో ‘పూర్ణ కలశాలు’ చెక్కబడి ఉన్నాయి. ఆలయ కళలో పూర్ణ కలశాలు సంపదను సూచించే ఎనిమిది పవ...